ఎపి ఎన్నికల నిఘా వేదిక కోఆర్డినేటర్‌గా ఓబులేసు

ఎపి ఎన్నికల నిఘా వేదిక కోఆర్డినేటర్‌గా ఓబులేసు

నియాకమకపత్రాన్ని అందుకుంటున్న నాగమల్లి ఓబులేసు

వజ్రకరూరు : ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల కమిషనర్‌ ఆమోదంతో ఎపి ఎన్నికల నిఘా వేదిక ఉరవకొండ నియోజకవర్గ కోఆర్డినేటర్‌గా జై కిసాన్‌ ఫౌండేషన్‌ ఫౌండర్‌ నాగమల్లి ఓబులేష్‌ నియమితులయ్యారు. ఈమేరకు అనంతపురంలో జరిగిన సమావేశం లో ఎపి ఎన్నికల నిఘా వేదిక జిల్లా రీజినల్‌ కోఆర్డినేటర్‌ నబిరసూల్‌తో నియామక పత్రా న్ని అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ కోఆర్డినేటర్‌గా బాధ్యతలు అప్పజెప్పినందుకు రీజినల్‌ కో ఆర్డినేటర్‌ నబిరసూల్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఉరవకొండ నియోజకవర్గంలోని పలుగ్రామాల్లో ఓటుహక్కు ఆవశ్యకతను తెలియజేస్తూ ఓటింగ్‌ శాతాన్ని గణనీయంగా పెంచే ప్రయత్నం చేస్తానన్నారు.

➡️