బీహార్ : బీహార్లో లోక్సభ ఎన్నికల నాలుగో దశ పోలింగ్ వేళ… ముంగేర్లోని చకాసిం ఇబ్రహీం శంకర్పూర్ మిడిల్ స్కూల్లోని బూత్ నంబర్ 210లో విషాదం జరిగింది. డ్యూటీ చేస్తున్న ప్రిసైడింగ్ అధికారి ఓంకార్ చౌదరి గుండెపోటుతో మృతి చెందారు. అతని ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించింది. అతన్ని ఆసుపత్రికి తరలించేలోగానే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్థారించారు.