ప్రజాశక్తి-అనంతపురం సిటీ : అనంతపురం నగరంలోని సునీతానగర్ లో ఉన్న అంగన్వాడి కేంద్రం – 08ను విద్యాశాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ ఆకస్మికంగా తనిఖీ చేపట్టారు. సెంటర్ లో చిన్నారులకు అందిస్తున్న పౌష్టికాహారం మరియు పాలు తదితర వాటిని పరిశీలించారు. ఆయన వెంట జిల్లా విద్యాశాఖ అధికారిణి బి.వరలక్ష్మి, ఐసీడీఎస్ పీడీ శ్రీదేవి ఉన్నారు.ఇక్కడ నుండి పదో తరగతి పరీక్ష కేంద్రాలు తనిఖీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.