ప్రజాశక్తి-రైల్వేకోడూరు : ప్రతి ఏడాది జనవరి నెలలో వచ్చే సంక్రాంతి పండుగ భోగి మంటలతో ఆదివారం తెల్లవారుజాము నుంచే ఘనంగా ప్రారంభమైంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో ఇంటి ముందు రంగురంగుల రంగవల్లికలతో అలంకరించి భోగి మంటలు వేసి తలంటి స్నానాలు చేసి ఘనంగా సంక్రాంతి పండుగ ప్రారంభించారు. ఇతర రాష్ట్రాలలోని తెలుగు వారందరూ సంక్రాంతి పండుగకు వారి వారి స్వగ్రామాలకు వెళ్లి సంప్రదాయబద్ధంగా సంక్రాంతి సంబరాలు కనుల పండుగ ప్రారంభించారు.
![bhogi festival in ap](https://prajasakti.com/wp-content/uploads/2024/01/bhogi-festival-in-ap.jpg)