ప్రజాశక్తి – చీరాల
క్యాన్సర్ వ్యాధి పట్ల ప్రజలందరూ అవగాహన కలిగి ఉండాలని డాక్టర్ శివానీ చాపరాల అన్నారు. ప్రపంచ కాన్సర్ దినోత్సవం సందర్భంగా స్థానిక ప్రాణహిత హాస్పిటల్లో కాన్సర్పై ఉచిత అవగాహన సదస్సు ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చీరాలలో క్యాన్సర్ హాస్పిటల్ లేకపోవడంతో ఇక్కడి వారు గుంటూరు, విజయవాడ, హైదరాబాద్ వెళ్లవలసి వచ్చేదని అన్నారు. కానీ ఇప్పుడు ఆ అవసరం లేకుండా తామే కాన్సర్ వైద్యం కోసం హాస్పిటల్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తమ హాస్పిటల్ నందు క్యాన్సర్పై ఉచితం వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు. చీరాల పరిసర ప్రాంతాల్లోని ప్రజలు తమ వైద్య సేవలు వినియోగించు కోవాలని కోరారు. మెరుగైన ఆరోగ్య సేవలు పొందాలని కోరారు. కార్యక్రమంలో డాక్టర్ జి పృద్వి, గైనకాలజిస్ట్ షణ్ముఖి శ్రీ, హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు.