ఇండియా వేదికతోనే ప్రజాస్వామ్యానికి రక్షణ

May 10,2024 00:12 ##vemuru #Congress

ప్రజాశక్తి – వేమూరు
రాష్ట్రంలో, దేశంలో కాంగ్రెస్‌ అధికారానికి వస్తేనే ప్రజాస్వామ్యానికి రక్షణ ఉంటుందని కాంగ్రెస్‌ ఎంఎల్‌ఎ అభ్యర్ధి బురగా సుబ్బారావు పేర్కొన్నారు. వేమూరు, కొల్లూరు మండలాల్లో గురువారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సిపిఎం, సిపిఐ నాయకులతో కలిసి చేపట్టిన ఎన్నికల ప్రచారంలో ఇంటింటికి తిరిగి కాంగ్రెస్ రూపొందించిన మేనిఫెస్టో కరపత్రాలను అందజేశారు. వెల్లబాడు, కొల్లూరు మండలంలోని లంక గ్రామాల్లో ప్రచారం చేశారు. రాష్ట్రంలో రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు, ప్రత్యేక హోదా వంటి అంశాలను సాధించడంతోపాటు ప్రతి రైతుకు రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని అన్నారు. ఎంఎల్‌ఎగా తనను, బాపట్ల ఎంపిగా జెడి శీలంను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ ఇన్‌ఛార్జి తాడికొండ వెంకటేశ్వరరావు, భట్టిప్రోలు, కొల్లూరు, వేమూరు మండలాల కాంగ్రెస్‌ అధ్యక్షులు నిజాంపట్నం ఏడుకొండలు, సిపిఎం నాయకులు ఎం సత్యనారాయణ, బొనిగల సుబ్బారావు, వేములపల్లి వెంకటరామయ్య, జి నాగరాజు, సిపిఐ నాయకులు గొట్టుముక్కల బాలాజీ, శ్రీనివాసరావు పాల్గొన్నారు.

➡️