మంత్రి నాగార్జున ఎన్నికల ప్రచారం

Mar 29,2024 00:14 ##Minister #meruga #Nagarjuna

ప్రజాశక్తి – నాగులుప్పలపాడు
మండలంలో నిడమానూరు, హనుమాపురం, కావూరోరిపాలెం, చేకూరపాడు తదితర గ్రామాల్లో సాంఘిక సంక్షేమ శాఖా మంత్రి, సంతనూతలపాడు నియోజకవర్గ వైసిపి అభ్యర్ది డాక్టర్‌ మేరుగు నాగార్జున ఎన్నికల ప్రచారం గురువారం నిర్వహించారు. నియోజకవర్గ అభివృద్దికి కృషి చేస్తానని అన్నారు. రానున్న ఎన్నికల్లో తనను ఆదరించాలని కోరారు. ఈసందర్బంగా నాయకులు, కార్యకర్తలు ఏర్పాటు చేసిన పరిచయ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఆయా గ్రామాల్లో ఇంటి ఇంటి ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో ఎఎంసి చైర్మన్ మారెళ్ళ బంగారుబాబు, మాదిగ కార్పోరేషన్ రాష్ట్ర చైర్మన్ కొమ్మూరి కనకారావు, వాణీజ్యవిభాగపు రాష్ట్ర కార్యదర్శి నలమలపు కృష్ణారెడ్డి, పి శ్రీమన్నారాయణ, పి పరందామిరెడ్డి, సర్పంచ్ వడ్డిముక్కల శ్రీనివాసరావు, రమణారెడ్డి, పోలినేని కోటయ్య పాల్గొన్నారు.

➡️