ప్రజాశక్తి – చీరాల
పట్టణంలోని 31వ వార్డు, ఎన్ఆర్ అండ్ పిఎం హై స్కూల్ వెనుక, మునిసిపల్ ఆఫీస్ వెనుక గల మూడు పార్కులల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను శాసన సభ్యులు కరణం బలరామ కృష్ణ మూర్తి బుధవారం పరిశీలించారు. పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని, సకాలంలో పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో చైర్మన్ జంజనం శ్రీనివాసరావు, వైసిపి పట్టణ అధ్యక్షులు కొండ్రు బాబ్జీ, కౌన్సిలర్ సల్లూరి అనిల్, గొట్టిపాటి ఎబినేజరు, పొత్తూరి సుబ్బయ్య, వాసిమల్ల రత్నం, భూషణం, మామిడాల సుబ్బారావు, చిలుకోటి శ్రీనివాసరావు, చిన్ని లీలాధర్, మున్సిపల్ డిఇ ఐసయ్య, ఎఇ కట్టా రవి పాల్గొన్నారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2023/12/WhatsApp-Image-2023-12-20-at-15.33.33.jpeg)