టిడిపితోనే రాష్ట్ర అభివృద్ధి : గొట్టిపాటి

Apr 28,2024 01:32 ##tdp #Addanki

ప్రజాశక్తి – మేదరమెట్ల
సంక్షేమం, అభివృద్ధి సక్రమంగా జరగాలంటే టిడిపి అధికారానికి రావాలని టిడిపి, జనసేన, బిజెపి ఉమ్మడి ఎంఎల్‌ఎ అభ్యర్థి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. కొరిసపాడు మండలంలోని రావినూతల గ్రామంలో శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సైకో జగన్ పోయి సైకిల్ రావాలని ఓటర్లతో అన్నారు. ఇంటింటికి తిరుగుతూ ఓటర్లను కలుస్తూ రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందని వివరించారు. సజావుగా అభివృద్ధి సాగాలంటే టిడిపి ప్రభుత్వమే రావాలని కోరారు. ఆయన వెంట చెనుపాటి హరిబాబు, కారుసాల గురు బాబు, మేదరమెట్ల శ్రీనివాసరావు, కారుసాల నాగేశ్వరరావు, కారుసాల ప్రతాప్, మాజీ ఎంపీటీసీ రామినేని వెంకటరమణ పాల్గొన్నారు.

➡️