ప్రజాశక్తి-రంపచోడవరం
ప్రస్తుత పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా బ్లాక్ కూటమి అభ్యర్థులను గెలిపించాలని సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్ తదితర పార్టీల నాయకులు కోరారు. అల్లూరి జిల్లా పెదబయలు సోమవారపు సంతలో ఇండియా బ్లాక్ అరకు నియోజకవర్గం నుంచి ఎంపీ అభ్యర్థిగా సిపిఎం నుంచి పాచిపెంట అప్పలనర్స, కాంగ్రెస్ అసెంబ్లీ అభ్యర్థి శెట్టి గంగాధరా స్వామిని గెలిపించాలని కోరుతూ సోమవారం ప్రచార కార్యక్రమం జరిగింది. సిపిఎం మండల కార్యదర్శి బోండా సన్నిబాబు, శ్రీనివాసరావు బి.గంగాధరం తదితరులు పాల్గొన్నారు.