24న రాజంపేటకు చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌

రాకప్రజాశక్తి-రాజంపేట అర్బన్‌ అన్నమయ్య జిల్లా రాజంపేటలో ఉమ్మడి బహిరంగ సభలో పాల్గొనేందుకు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ రానున్నారు. ఈ మేరకు కూటమి అభ్యర్థులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఏర్పాట్లను టిడిపి జోనల్‌ కో-ఆర్డినేటర్‌ దీపక్‌రెడ్డి పరిశీలించేందుకు రాజంపేటకు బుధవారం వచ్చారు. ఈ సంద ర్భంగా ఆయన ఎబి.చంద్రారెడ్డి గార్డెన్స్‌లో టిడిపి రాజంపేట పార్లమెంటు అధ్యక్షులు చమర్తి జగన్మోహన్‌రాజు, అసెంబ్లీ అభ్యర్థి సుగ వాసి సుబ్రహ్మణ్యంలతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాతీయ పత్రికలు, ప్రసార మాధ్య మాలు ఎన్డీఏ కూటమి భారీ విజయం సొంతం చేసుకో బోతున్నట్లు వెల్లడిస్తు న్నాయ న్నారు. జాతీయ మీడియా నిర్వహించిన 11 సర్వేలు సైతం రెండు నుంచి ఏడు పార్లమెంట్‌ స్థానాలలో మాత్రమే వైసిపి దక్కించు కుంటుందని సర్వేలు చెబుతున్నాయని వివరిం చారు. రెండు నెలలుగా వైసిపి గ్రాఫ్‌ పూర్తిగా పడిపోతూ వస్తోందని తెలిపారు. వైసిపి నేతలు జగన్‌కు తగిలిన గులకరాయితో దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. కూటమి అభ్యర్థులు అపారమైన ఆత్మవి శ్వాసంతో ఉన్నారని తెలిపారు. ఈ నెల 24వ తేదీన సుగవాసి నామినేషన్‌ ఘట్టానికి చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌ పాల్గొంటున్నారని, రాజంపేటలో సాయంత్రం ఏర్పాటు చేయబోవు బహిరంగ సభకు అభిమానులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.

➡️