ఘనంగా టిడిపి ఆవిర్భవ దినోత్సవం

Mar 29,2024 15:07 #Chittoor District

ప్రజాశక్తి – ఎస్ఆర్ పురం : మండల కేంద్రమైన ఎస్ఆర్ పురం పుల్లూరు క్రాస్ లో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టిడిపి మండల అధ్యక్షులు గంధమనేని జయశంకర్ నాయుడు ఆధ్వర్యంలో 42 వ పార్టీ ఆవిర్భవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలుగువాడి ఆత్మగౌరవం నిలబెట్టడానికి పార్టీ స్థాపించిన మహోన్నత వ్యక్తి ఎన్టీ రామారావు వారు చేసిన కృషి మరువలేనిదని ఈ సందర్భంగా స్మరించుకున్నారు. అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంచిపెట్టి సంబరాలు జరుపుకున్నారు. కార్యక్రమంలో టిడిపి, జనసేన, బిజెపి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️