గ్రామదేవత పండుగలకు ప్రత్యేక ఏర్పాట్లు : కమిషనర్‌

May 18,2024 20:29

ప్రజాశక్తి- బొబ్బిలి : మున్సిపాలిటీలోని నేటి నుంచి గొల్లపల్లి శ్రీదాడితల్లి, పాతబొబ్బిలి శ్రీసరేపొలమ్మతల్లి గ్రామ దేవతలు పండుగల సందర్భంగా పారిశుధ్య పనులు, తాగునీటి సరఫరాకు ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు మున్సిపల్‌ కమిషనర్‌ ఎల్‌.రామలక్ష్మి చెప్పారు. గ్రామదేవత పండుగల సందర్భంగా ఆమె ప్రజాశక్తితో మాట్లాడారు. ప్రత్యేక పారిశుధ్య పనులుగ్రామ దేవత పండుగల సందర్భంగా ప్రజలు, భక్తులు ఇబ్బందులు పడకుండా పారిశుధ్య పనులు నిర్వహణకు ప్రత్యేక చర్యలు తీసుకున్నాం. మున్సిపాలిటీలో అన్ని ప్రాంతాల్లో పారిశుధ్య పనులు చేపట్టి కాలువలు శుభ్రం చేస్తున్నాం. సిరిమానోత్సవం సందర్భంగా దాడితల్లి, సరేపొలమ్మతల్లి సిరిమానోత్సవం వెనుక రెండు పారిశుధ్య కార్మికులతో టీములు ఏర్పాటు చేసి సిరిమాను వెనుక వెళ్లి పారిశుధ్య పనులు చేస్తారు. ప్రజలు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకుంటున్నాం.రెండు ట్యాంకర్లతో తాగునీరు సరఫరాప్రజలు తాగునీటి కోసం ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకుంటున్నాం. కుళాయిలతో రెగ్యులర్‌గా తాగునీరు సరఫరా చేయడంతో పాటు రెండు మంచినీటి ట్యాంకర్లతో తాగునీరు సరఫరా చేస్తాం. పాతబొబ్బిలి ప్రజలకు ఒక ట్యాంకర్‌, గొల్లపల్లి ప్రజలకు మరో ట్యాంకర్‌తో తాగునీరు అందిస్తాం. ప్రజలు తాగునీటి కోసం ఇబ్బందులు పడకుండా చూస్తాం.సిరిమానోత్సవం విజయవంతానికి చర్యలురెండు సిరిమానోత్సవాలు విజయవంతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. శ్రీదాడితల్లి, శ్రీసరేపొలమ్మతల్లి సిరిమానోత్సవం జరిగే రోడ్లుపై ఉన్న గోతులను పూడ్చుతున్నాం. కాలువలపై ఆక్రమణలు తొలగిస్తాం. రోడ్లుపై నిర్మాణ సామగ్రి లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. సిరిమానోత్సవంలో ఎటువంటి అల్లర్లూ జరగకుండా ఉత్సవ కమిటీ సభ్యులతో చర్చలు జరిపాం. రెండు కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటుపాతబొబ్బిలి శ్రీసరేపొలమ్మతల్లి ఆలయం, గొల్లపల్లి శ్రీదాడితల్లి ఆలయాలు వద్ద రెండు కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేశాం. పారిశుధ్యం, తాగునీటి సమస్యలపై కంట్రోల్‌ రూమ్‌లో ఫిర్యాదు చేస్తే వెంటనే పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం. రెండు గ్రామదేవత పండుగలు విజయవంతం చేసేందుకు ప్రజలు, భక్తులు సహకరించాలని ఆమె కోరారు.

నేటి నుంచి జంట పండుగలు

గొల్లపల్లి శ్రీదాడితల్లి, పాతబొబ్బిలి శ్రీసరేపొలమ్మతల్లి గ్రామదేవత పండుగలు నేటి నుంచి జరగనున్నాయి. ఆదివారం దేశతల్లి వారాలు, సోమవారం తోలేళ్ల ఉత్సవం, మంగళవారం సిరిమానోత్సవం నిర్వహించనున్నారు. మూడు రోజులు పండుగలు ఘనంగా నిర్వహించేందుకు ఉత్సవ కమిటీ ఏర్పాట్లు చేసింది.

➡️