‘దర్శి’ అభివృద్ధే థ్యేయం : గొట్టిపాటి

దర్శి : దర్శి నియోజక వర్గ అభివృద్ధే తన థ్యేయమని టిడిపి కూటమి దర్శి నియోజక వర్గ అభ్యర్థి డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి తెలిపారు. మండల పరిధిలోని జముకులదిన్నె, లక్ష్మీపురం, కొత్తపల్లి, కొర్లమడుగు, కష్ణాపురం, చిన్నఉయ్యాల వాడా, రాజంపల్లి, పెద్ద ఉయ్యాలవాడ లో ఆదివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ లక్ష్మి మాట్లాడుతూ గ్రామాలలో సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కరించేందుకు కృ చేస్తానని తెలిపారు. ఈ కార్యక్ర మంలో నాయకులు గొర్రె సుబ్బారెడ్డి, మాగం సుబ్బారావు, అంజయ్య, మాజీ ఎంపిపి ఫణిదపు వెంకటరామయ్య, వజ్జాశ్రీనివాసరావు, వజ్జా రాయణమ్మ, కష్ణ, నాదెండ్ల అంజయ్య, రావి సుబ్బారావు, పోతిరెడ్డి అంజిరెడ్డి తెలిపారు. టిడిపిలో చేరిక సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి అభ్యర్థులను గెలిపించాలని టిడిపి దర్శి నియోజకవర్గ ఇన్‌ఛార్జి గోరంట్ల రవికుమార్‌, మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు కోరారు. గొట్టిపాటి నివాసం వద్ద ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడారు. వైసిపి పాలనలో రాష్ట్రం అధోగతి పాలైనట్లు తెలిపారు. ఈ సందర్భంగా వివిధ గ్రామాలకు చెందిన వారు టిడిపిలో చేరారు. లలిత సాగర్‌, కడియాల వెంకటేశ్వర్లు వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

➡️