టిడిపితోనే గ్రామాల అభివృద్ధి

ప్రజాశక్తి-శింగరాయకొండ : తెలుగుదేశం తోనే గ్రామాలు అభివద్ధి చెందుతాయని టిడిపి కొండపి నియోజక వర్గ అభ్యర్థి, ఎమ్మెల్యే డాక్టర్‌ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. జరుగుమల్లి మండల పరిధిలోని నందనవనం బిట్రగుంట వావిలేటిపాడు, జరుగు మల్లి, పొంగులూరు వారిపాలెం, దావగుండూరు, చింతలపాలెం గ్రామాల్లో శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సంద ర్భంగా స్వామి మాట్లాడుతూ గతంలో టిడిపి హయాంలో దామచర్ల ఆంజనేయులు, ఆ తర్వాత తన హయాంలో గ్రామాలను అభివద్ధి చేసినట్లు తెలిపారు. వైసిపి ఐదేళ్ల పాలనలో గ్రామాల్లో ఏమి అభివద్ధి పనులు చేశారో చెప్పాలన్నారు. గ్రామాల అభివృద్ధి టిడిపితోనే సాధ్యమని తెలిపారు. సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డిని, కొండపి ఎమ్మెల్యేగా తనను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు పోకూరి రవీంద్రబాబు , పోటు పెద్దబాబు, బెల్లం సత్యనారాయణ, విజయనిర్మల, పాతూరి కోటేశ్వరరావు, శివాజీ పాల్గొన్నారు.

➡️