పాలనా అంశాలపై కలెక్టర్లతో సిఎస్‌ సమీక్ష

Apr 23,2024 22:54
పాలనా అంశాలపై కలెక్టర్లతో సిఎస్‌ సమీక్ష

ప్రజాశక్తి-రాజమహేంద్రవరం రూరల్‌ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ కెఎస్‌.జవహర్‌ రెడ్డి జిల్లా కలెక్టర్లతో మంగళవారం పరిపాలనా అంశాలపై వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. విజయవాడలోని సిఎస్‌ క్యాంపు కార్యాలయం నుంచి నిర్వహించిన ఈ సమావేశంలో తూర్పు గోదావరి జిల్లా నుంచి కలెక్టర్‌ కె.మాధవీలత మాట్లాడారు. జిల్లాలో ఉపాధి హామీ పనులను మే ఒకటో తేదీ నుంచి మరింత పెంచుతామని తెలిపారు. జిల్లాకు సంబంధించి ఈ ఏడాది 30 లక్షల పని దినాలు లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటి వరకు 3.42 లక్షల మేర లక్ష్యాలను సాధించినట్టు తెలిపారు. జిల్లాలో తాగునీటి సరఫరాకు ఎటువంటి ఇబ్బందులూ లేకుండా చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. విద్యుత్‌ సరఫరా, తాగునీటి సరఫరాకుకు చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. ఈ సమావేశంలో ఎపిఇపిడిసిఎల్‌ టివిఎస్‌ఎన్‌.మూర్తి, డ్వామా పీడీ ఎ.ముఖలింగం, ఆర్‌డబ్ల్యుఎస్‌ ఎసోఇ డి.బాల శంకరరావు, ఆర్‌ఎంసి ఎస్‌ఇ జి.సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.

➡️