రెడ్‌క్రాస్‌ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

ప్రజాశక్తి – ఏలూరు అర్బన్‌
యూనియన్‌ బ్యాంక్‌ 105వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని రెడ్‌క్రాస్‌ ఆధ్వర్యంలో స్థానిక ఆర్‌ఆర్‌.పేటలోని యూనియన్‌ బ్యాంక్‌ రీజనల్‌ కార్యాలయం వద్ద ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరంలో 45 మంది బ్యాంకు ఉద్యోగులు రక్తదానం చేశారని జిల్లా రెడ్‌క్రాస్‌ ఛైర్మన్‌ బివి.కృష్ణారెడ్డి తెలిపారు. ఈ శిబిరానికి ముఖ్య అతిథిగా రీజనల్‌ హెడ్‌ ఎంజికె.మూర్తి హాజరై రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మూర్తి మాట్లాడుతూ నవంబర్‌ 11 యూనియన్‌ బ్యాంక్‌ వ్యవస్థాపక దినోత్సవం జరుపుకుంటున్నామని, ప్రతి సంవత్సరం నవంబర్‌ నెలలో సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తామని, అందులో భాగంగా రెడ్‌క్రాస్‌ సహకారంతో రక్తదాన శిబిరాన్ని నిర్వహించామని చెప్పారు. ఈ సందర్భంగా యూనియన్‌ బ్యాంక్‌ అభివృద్ధికి సహకరిస్తున్న కస్టమర్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ రీజనల్‌ హెడ్‌ రామ్మోహన్‌రావు, కిరణ్‌కుమార్‌, డాక్టర్‌ ఆర్‌ఎస్‌ఆర్‌కె వరప్రసాదరావు, పిఆర్‌ఒ కెవి.రమణ, బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు.

➡️