ప్రజాశక్తి-ఆగిరిపల్లి
ఇండియా బ్లాక్ బలపర్చిన కాంగ్రెస్ నూజివీడు నియోజకవర్గ అభ్యర్థి మరీదు కృష్ణ, ఏలూరు పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి కావూరి లావణ్యలను గెలిపించాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో ఆగిరిపల్లి మండలంలోని ఆగిరిపల్లి , నెక్కలం గొల్లగూడెం, ఈదులగూడెంలో నాయకులు శుక్రవారం ప్రచారాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం ఆగిరిపల్లి మండల నాయకులు చాకిరి నాగరాజు, ముత్యాల నరేష్, సత్తు కోటేశ్వరరావు, రవీంద్రా, సుభాకర్ , స్టాలిన్ తదితరులు పాల్గన్నారు. ప్రజలకు ఎన్డిఎ అభ్యర్థులను ఓడించాలనీ, ఇండియా బ్లాక్ అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ కరపత్రాలను పంపిణీచేశారు.