ప్రజాశక్తి వార్తకు స్పందన
ప్రజాశక్తి – జీలుగుమిల్లి
మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్మిస్తున్న లాంగ్ జంప్ గోడ నిర్మాణం ఈనెల 7వ తేదీన కురిసిన వర్షానికి కుంగిపోయింది. ఈమేరకు ఈనెల 9వ తేదీన ‘కుంగిపోయిన లాంగ్ జంప్ నిర్మాణం’ అనే శీర్షికతో ప్రజాశక్తిలో వార్త వెలువడిన అంశం పాఠకులకు విధితమే. దీంతో స్పందించిన అధికారులు నిర్మాణ పనులను శుక్రవారం పున: ప్రారంభించారు. ప్రధానోపాధ్యాయురాలు టి.చంద్రావతి గురువారం పాఠశాలకు చేరుకొని గోడ నిర్మాణ ప్రదేశాన్ని పరిశీలించారు. అనంతరం కాంట్రాక్టర్ను పిలిచి నీటిని బయటకు పోయేలా చూడాలని కోరారు. వెను వెంటనే పనులను ప్రారంభించి గోడ నిర్మాణాన్ని నాణ్యతతో త్వరితగతిన పూర్తి చేసి, చుట్టూత మట్టి పోసి సిద్ధం చేయాలని కాంట్రాక్టర్కు ఆదేశించినట్లు ఆమె తెలిపారు.