ప్రజాశక్తి-పల్నాడు జిల్లా :ప్రతి ఒక్కరూ తప్పని సరిగా ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి శివశంకర్ లోతేటి పేర్కొన్నారు. శనివారం స్థానిక నరసరావుపేట కలెక్టర్ కార్యాలయంలో రోడ్డు సేఫ్టీ స్వచ్చంద సంస్థ ఆధ్వర్యం లో ఏర్పాటు చేసిన ”రండి ఓటు వేద్దాం – ఓటింగ్ శాతం పెంచుదాం” సంచార ప్రచార రథాన్ని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఓటుకు మధ్యం వద్దు..డబ్బులు వద్దు ..బహుమతులు తీసుకోకుండా స్వచ్ఛందంగా పోలింగ్ కేంద్రాల వద్దకు వెళ్లి ఓటు వేద్దాం అని ప్రచారం చేయడం మంచిది అని ప్రశంసించారు. స్వచ్చంద సంస్థ అధ్యక్షురాలు ఆర్. కె. దుర్గ పద్మజ మాట్లాడుతూ ప్రధానంగా అర్బన్ ప్రాంతాల్లో ఉన్న ఓటర్లు ఓటు వేసే విషయంలో అశ్రద్ధ వహిస్తున్నారని, వారికి కరపత్రాలు పంపిణీ చేసి ఓటు హక్కు ఆవశ్యకతపై అవగాహన కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ కల్పశ్రీ,రెవెన్యూ అధికారి వినాయకం స్వచ్చంద సంస్థ సభ్యులు బంగారయ్య, కోటేశ్వరరావు,వెంకటేశ్వరరావు సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.