కొండ ప్రాంతాల్లో మంచినీరందిస్తా

Apr 27,2024 14:43 #Jai Bharat Party
  • జై భారత్‌ ఎమ్మెల్యే అభ్యర్థి పోతిన రాము

విజయవాడ:విజయవాడ పశ్చిమ నియోజకవర్గాన్ని దశాబ్దాలుగా పట్టించుకున్న నాయకుడు లేడని, ఇప్పటికైనా ఇక్కడి సమస్యల్ని తీర్చాలని జై భారత్‌ ఎమ్మెల్యే అభ్యర్థి పోతిన వెంకట రామారావు అన్నారు. ముఖ్యంగా కొండ ప్రాంతంలో ప్రజలు ప్రమాదం అంచున, పారిశుధ్యాన్నికి దూరంగా భారంగా బతుకులు వెళ్లదీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక 48, 52 డివిజన్లలోని వాగు సెంటర్‌, బ్రహ్మంగారి మఠం, ఈద్గా మహల్‌ వీధుల్లో పోతిన రాము ఇంటింటి ప్రచారం చేశారు. ఈ సందర్బంగా స్థానికులు తమ సమస్యల్ని వివరించారు. కొండ ప్రాంతంలో శానిటేషన్‌ లోపంతోపాటు, ప్రమాదకరంగా మెట్ల మార్గాలు అక్కడి వారికి శాపంలా మారాయి. దీనికి తోడు కుక్కల స్వైరవిహారంతో పిల్లలకు ప్రాణ సంకటంగా మారిందని తెలిపారు. మెట్ల మార్గాన్ని బాగు చేసేందుకు తమ జైభారత్‌ పార్టీ నుంచి చర్యలు తీసుకుంటామని పోతిన రాము హామీ ఇచ్చారు. పశ్చిమ నియోజకవర్గం అభివఅద్ధికి ఏటా వంద కోట్లు కేటాయించి, మోడల్‌ నియోజకవర్గంగా మారుస్తామన్నారు.

➡️