ప్రజాశక్తి-భీమునిపట్నం : టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థిగా గంటా శ్రీనివాసరావు గురువారం స్థానిక ఆర్డీవో కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి, ఆర్డీవో ఎస్ భాస్కర రెడ్డికి నామినేషన్ పత్రం అందజేశారు. గంటా అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదిస్తూ టిడిపి రూరల్ మండల అధ్యక్షులు దంతులూరి అప్పల నరసింహరాజు నామినేషన్ పత్రం దాఖలు చేశారు. గంటాతో అతని కుమారుడు రవి తేజ నామినేషన్ పత్రం దాఖలు చేశారు. ఇతని అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదిస్తూ టిడిపి నాయకులు మొల్లి లక్ష్మణ రావు మరో నామినేషన్ పత్రం దాఖలు చేశారు.