ప్రజాశక్తి – సాలూరు: ఎమ్మెల్యేగా మరో అవకాశం ఇస్తే నియోజకవర్గంలో అభివద్ధి పనులు పరుగెత్తిస్తానని డిప్యూటీ సీఎం రాజన్నదొర అన్నారు. పట్టణంలోని 25వ వార్డు పిఎన్ బొడ్డవలసలో రాజన్నదొర ఇంటింటికీ తిరిగి అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి వివరించారు. కార్యక్రమంలో వైసిపి జిల్లా ప్రధాన కార్యదర్శి జర్జాపు సూరిబాబు జెసిఎస్ కన్వీనర్ గిరిరఘు కౌన్సిలర్ సింగారపు ఈశ్వరరావు, వైసిపి నాయకులు టి.బలరాం పాల్గొన్నారు.పలు కుటుంబాలు వైసిపి లో చేరిక పట్టణంలోని 15వ వార్డు కుమ్మరివీధికి చెందిన 30 కుటుంబాలు గురువారం వైసిపి లో చేరాయి. డిసిఎంఎస్ డైరెక్టర్ పిరిడి రామకృష్ణ, వైసిపి నాయకులు లెంక శివ, రౌతు సురేష్ ఆధ్వర్యాన వారు డిప్యూటీ సీఎం రాజన్నదొర సమక్షంలో పార్టీలో చేరారు. వారిని కండువాలు కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు. గుమడాంలో10 కుటుంబాలకు చెందిన టిడిపి కార్యకర్తలు వైసిపిలో చేరారు. వైసిపి జిల్లా కార్యదర్శి జర్జాపు సూరిబాబు ఆధ్వర్యాన వారు వైసిపిలో చేరారు.ఏజెన్సీ ప్రాంతంలో వైసిపి ప్రచారం సాలూరు: మండలంలోని ఏజెన్సీ గ్రామాల్లో వైసిపి నాయకులు గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్ పర్సన్ రెడ్డి పద్మావతి, వైస్ ఎంపిపి రెడ్డి సురేష్, మండల జెసి ఎస్ కన్వీనర్ కళ్ళేపల్లి త్రినాధ్ నాయుడు, ఎస్టి సెల్ జిల్లా కన్వీనర్ కొండ గొర్రి ఉదరు కుమార్, కరడవలస, కొత్తవలస గ్రామాలలో ఇంటింటికీ తిరిగారు. ఎమ్మెల్యేగా రాజన్నదొరని మరోసారి గెలిపించాలని, గిరిజన సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు.