ప్రజాశక్తి -మామిడికుదురు (కోనసీమ) : లూటుకుర్రులో 20.80లక్షలు వ్యయంతో నిర్మించిన వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ నూతన భవనాన్ని ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదలు ముంగిటకే సంక్షేమ పదకాలు అందించడమే కాకుండా అభివద్ధి చెపడుతున్న వైసిపి ప్రభుత్వన్ని ఆదిరించి మరోసారి వైసిపిని అధికారంలోకి తీసుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి కుసుమ వనజకుమారి శ్రీధర్, జెడ్పిటీసి కె.అంజిబాబు, సర్పెంచ్లు అడబాల తాతకాపు, జాలెం రమణకుమారి, ఎంపిటీసిలు నామన వెంకటేశ్వరరావు, జాలెం అనూష, కొమ్ముల రాము, కటకంసెట్టి ఆదిత్య, చింతా కుమారి రామకృష్ణ, కొప్పాడి నాగేశ్వర్రావు, చిట్టూరి లక్ష్మీ నారాయణ, విప్పర్తి నాగేశ్వరరావు, పంచాయితీ కార్యదర్సులు డి సురేస్, పి ఎస్ వి ఎస్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/02/hospital-1.jpg)