ప్రజాశక్తి-యర్రగొండపాలెం: సంక్షేమ పథకాల రథసారథి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి మరోసారి పట్టం కట్టాలని, ప్రజలను యర్రగొండపాలెం నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తాటిపర్తి చంద్రశేఖర్ కోరారు. బుధవారం యర్రగొండపాలెం పట్టణంలోని చైతన్య నగర్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రజల శ్రేయస్సు కోసం పరితపించే నాయకుడు సిఎం జగన్మోహన్రెడ్డి అని తెలిపారు. నవరత్నాల పేరుతో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ప్రజల జీవితాల్లో వెలుగులు నింపారన్నారు. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి చొరవ చూపారని అన్నారు. సంక్షేమ పాలనలో జగన్ సరికొత్త ఒరవడిని సృష్టించారన్నారు. ఎన్ని కష్టాలు ఎదురైనా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో వెనుకడుగు వేయని ఏకైక నాయకుడు జగన్ అని కితాబునిచ్చారు. రాష్ట్రంలో కొనసాగుతున్న సంక్షేమ పథకాలు తిరిగి కొనసాగాలంటే మరోసారి వైసీపీ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు. ఇంటింటికీ తిరుగుతూ సంక్షేమ పథకాల లబ్ధిని వివరించారు. ఇలాగే సంక్షేమ పథకాలు రావాలంటే ఫ్యాను గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి దొంతా కిరణ్ గౌడ్, జడ్పిటిసి చేదూరి విజయభాస్కర్, వైసీపీ మండల కన్వీనర్ కొప్పర్తి ఓబుల్రెడ్డి, సర్పంచ్ రామావత్ అరుణాబాయి, నాయకులు నర్రెడ్డి వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.