ప్రజాశక్తి – కాకినాడ
కాకినాడ జిల్లా కలెక్టర్గా జె.నివాస్ నియమితులయ్యారు. నివాస్ ప్రస్తుతం రాష్ట్ర వైద్యఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్గా విధులు నిర్వహిస్తున్నారు. గురువారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్.జవహర్ రెడ్డి కాకినాడ కలెక్టర్గా నివాస్ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇంతవరకు కలెక్టర్గా విధులు నిర్వర్తించిన డాక్టర్ కృతికా శుక్లా జిల్లాల పునర్విభజనలో భాగంగా ఏర్పడిన కాకినాడ జిల్లాకు 2022లో కలెక్టర్గా వచ్చారు. సుమారు రెండేళ్లపాటు ఆమె ఇక్కడ కలెక్టర్గా సేవలు అందించారు.