ప్రజాశక్తి – పెద్దాపురం
మండలంలోని వడ్లమూరు గ్రామంలో ఉపాధి కూలీలకు శుక్రవారం ఓటు సద్వినియోగంపై ఎంపిడిఒ ఉషారాణి ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వ హించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరు ఓటు వేయడం ద్వారా ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల ప్రజలకు పోలింగ్ శాతం పెంచేందుకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా ఆమె ఓటింగు యంత్రాల పనితీరు, యంత్రాలపై ఓటు వేసే విధానంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్ శ్రీను, పంచాయితీ కార్యదర్శి కళపాల్గొన్నారు.