ప్రజాశక్తి – సామర్లకోట
సామర్లకోట పట్టణంలో ఈనెల 27 శనివారం సాయంత్రం పవన్ కల్యాణ్ వారాహి సభను నిర్వహిస్తున్నట్లు జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు తుమ్మల రామస్వామి తెలిపారు. శుక్రవారం పట్టణంలోని నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త మంచెం సాయి గృహంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాష్ట్రానికి మంచి చేయాలన్నా లక్ష్యంతోనే టిడిపి, బిజెపితో కలిసి కూటమిగా పోటీ చేస్తున్నట్లు తెలిపారు. కూటమి బలపర్చిన జనసేన కాకినాడ ఎంపీ అభ్యర్థి తంగెళ్ల ఉదరు శ్రీనివాస్, టిడిపి పెద్దాపురం నియోజకవర్గ అభ్యర్థి నిమ్మకాయల చిన రాజాప్ప విజయం కోసం పవన్ సామర్లకోట రానున్నారని తెలిపారు. 27వ తేదీ శనివారం సాయంత్రం 5:30 గంటలకు స్టేషన్ సెంటర్లో జరిగే సభలో ఆయన మాట్లాడతారని, కావున నియోజకవర్గ ప్రజలు, జనసేన, టిడిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో జనసేన నాయకులు పిట్టా జానకి రామారావు, పెంకే వెంకట లక్ష్మి, సరోజ, తోట సాయి, లక్ష్మన్ దివాకర్, కటారి శ్రీను పాల్గొన్నారు.