10వ తరగతి విద్యార్థులకు సత్కారం

Apr 24,2024 22:57
సామర్లకోట మండలం పెద్ద

ప్రజాశక్తి – సామర్లకోట

సామర్లకోట మండలం పెద్ద బ్రహ్మదేవమ్‌ త్రివర్ణ హైస్కూల్లో 2022-23 విద్యా సంవత్సరంలో 500 మార్కులుపైగా సాధించిన మొదటి 10 మంది విద్యార్థులకు ఘన సత్కారం నిర్వహించారు. ప్రముఖ క్యాన్సర్‌ వైద్య నిపునులు డాక్టర్‌ చైతన్య దీపక్‌ చేతుల మీదుగా విద్యార్థులను సత్కరించారు. పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమానికి త్రివర్ణ స్కూల్‌ కరస్పాండెంట్‌ తోటకూర వెంకటేశ్వర రావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ 24 సంవత్సరాలుగా అత్యున్నతమైన విద్యను అందించడంలో విజయవంతంగా ముందుకు సాగుతున్న త్రివర్ణ హైస్కూల్‌ విశిష్టతను కొనియాడారు. అంతేకాకుండా త్రివర్ణలో విద్య అంటే భవిష్యత్తులో బంగారు బాట అని ఎంతో సంతోషంతో తన భావాలను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆట పాటలతో, క్రీడలలో గెలిచిన విద్యార్థులకు బహుమతులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు ప్రసాదరావు, తోటకూర శ్రీను, మలకల చంటిబాబు, విద్యార్థినీ, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

➡️