రైతుకూలీలకు అవగాహన కల్పిస్తున్న అధికారులు
ప్రజాశక్తి-ఆత్రేయపురం
ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా నిష్పక్షపాతంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ భవాని అన్నారు. బుధవారం ఆత్రేయపురం గ్రామంలో, ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద సార్వత్రిక ఎన్నికలు పురస్కరించుకుని స్వీప్ కార్యక్రమంలో భాగంగా ఓటర్లను చైతన్యవంతం చేశారు, సదరు కార్యక్రమం లో రైతులు, రైతు కూలీలు, లారీ డ్రయివర్లు, గ్రామ రెవెన్యూ అధికారి, మరియు ఇతర రెవిన్యూ సిబ్బంది పాల్గొన్నారు.