మధ్యాహ్న భోజనాన్ని మంత్రి పరిశీలన

Jun 28,2024 17:07

ప్రభుత్వ పాఠశాల్లో విద్యార్థినులతో మాట్లాడుతున్న మంత్రి సుభాష్‌

ప్రజాశక్తి-రామచంద్రపురం

ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకాన్ని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్‌ శుక్రవారం పరిశీలించారు. మండలంలోని తాళ్లపాలెం ప్రభుత్వ పాఠశాలలో ఆయన విద్యార్థులతో మాట్లాడారు.ఈ సందర్భంగా ఆయన విద్యార్థులను భోజనం ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు. ఆయనే స్వయంగా ప్లేట్‌ తీసుకొని మధ్యాహ్నం భోజనం రుచి చూశారు. అనంతరం ఇక్కడ పారిశుధ్యం పైన ఆరా తీశారు. పరిసరాలను పరిశుభ్రతను పాటించాలని, మెరుగైన ఆహారం, విద్య విద్యార్థులకు అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. అనంతరం రామచంద్రపురం జూనియర్‌ కళాశాలను, పాలిటెక్నిక్‌ కళాశాలను ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. అదేవిధంగా తాగునీరు శుభ్రత కూడా పరిశీలించారు. ప్రస్తుత వర్షాకాలంలో తాగునీటి పైన ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆయన సూచించారు. ఆయన వెంట పలువురు టిడిపి కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

➡️