లంక గ్రామాల్లో ఉమ్మడి అభ్యర్థి ‘గిడ్డి’ ప్రచారం

Apr 20,2024 17:16

పెదపట్నం లంక లో విలేకరుల సమావేశం లో ఉమ్మడి అభ్యర్థి గిడ్డి

ప్రజాశక్తి-మామిడికుదురు

లంక గ్రామాలెన బి.దొడ్డవరం, పెదపట్నంలంక లో శనివారం పి.గన్నవరం నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి గిడ్డి సత్యనారాయణ టిడిపి, జనసేన, బిజెపి నాయకులు కార్యకర్తలు తో కలిచి ప్రచారం నిర్వహించారు. సర్పెంచ్‌ సుందరనీడి రాజేస్‌ కుమార్‌ ఇంటి వద్ద విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇరిగేషన్‌ కాలువ ఏర్పాటుకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. డ్రయినేజీ సదుపాయం, తాగు నీరు, నదీ కోత నివారణకు గ్రోయిన్లు ఏర్పాటుకు ప్రాధాన్యత కలిపిస్తామన్నారు. తనతో పాటు ఎంపి అభ్యర్థి హరీష్‌ మాథూర్‌లను గెలిపించాలని కోరారు.ఈ సమావేశం లో జెడ్‌ పి మాజీ చైర్మన్‌ నామన రాంబాబు, టిడిపి మండల శాఖ అధ్యక్షులు ఎం.శ్రీనివాస్‌, జనసేన మండల శాఖ అధ్యక్షులు జె శ్రీనివాసా రాజా, విళ్ళ సుబ్బారావు, అడభాల తాతకాపు, బోణం బాబు, పెదపట్నం సర్పెంచ్‌ గుబ్బల దుర్గ, నల్లా పవన్‌, నల్లా అజరు, కుంపట్ల నాయుడు, అరుమిల్లి లాల్‌ బాబు, డొక్కా నాథ్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

 

➡️