ప్రజాశక్తి-చల్లపల్లి : ఉపాధి కూలీలకు దినసరి వేతనం 600 ఇవ్వాలని మండల పార్టీ కార్యదర్శి యద్దనిపూడి మధు, సిఐటియు మండల కార్యదర్శి మహమ్మద్ ఖరీముల్లా డిమాండ్ చేశారు. శనివారం మండల పరిధిలోని మంగళాపురంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలీలను కలిసి మాట్లాడారు. గత నెల రోజులుగా పనిచేస్తున్న వేతనాలు అందించలేదని అన్నారు. ఉపాధి కూలీలకు పంపిణీ చేయాల్సి ఉన్న అమలు జరగటంలేదని అన్నారు. పని ప్రాంతంలో షామియానా ఏర్పాటు చేయాలని అధికారులను కోరారు. 200 రోజులు పనితనాలు పెంచాలని, రెండు పూటల పని చేయాలని నిబంధనలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధి కూలీలకు బడ్జెట్ పెంచకపోవడం కూలీల మోసం చేసినట్టే అని ఆరోపించారు. ఆన్లైన్ మస్తాన్ విధానం వల్ల కూలీలు నష్టపోతున్నారని విచారం వ్యక్తం చేశారు. ఆ విధానాన్ని రద్దు చేయాలన్నారు.