ప్రజాశక్తి – కృష్ణా ప్రతినిధి
ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహనరెడ్డి కృష్ణాజిల్లా కేంద్రమైన మచిలీపట్నం రానున్నారు. ఈ మేరకు వైసిపి ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. మధ్యాహ్నం 3 గంటలకు మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలోని మచిలీపట్నం టౌన్ వల్లూరి రాజా సెంటర్లో జరిగే ప్రచార సభలో సిఎం పాల్గొంటారు.