మలేరియా అవగాహనా ర్యాలీ

Apr 25,2024 23:16

ప్రజాశక్తి-ఉయ్యూరు

దేశంలో 2027 నాటికి మలేరియా మరణాలు లేకుండా చేయడంతో పాటు 2030 సంవత్సరానికి మలేరియా కేసులు ఉండకూడదన్న లక్ష్యాన్ని చేరుకోవడానికి అందరూ సహకరించాలని జిల్లా మలేరియా అధికారి బి.రామారావు అన్నారు. మలేరియా డే పురస్కరించుకుని ఉయ్యూరు అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌, మండల ప్రాథమిక కేంద్రం ఆధ్వర్యంలో గురువారం ఉయ్యూరు, కాటూరు, ముదునూరులో మలేరియా వ్యాధిపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వ్యాధి సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కాటూరు పీహెచ్సీ అధికారి శివరామకృష్ణ మాట్లాడుతూ వ్యాధి వచ్చినత రువాత చికిత్స చేయించుకోవడం కన్నా రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉయ్యూరు అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌ అధికారి గోపీచంద్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️