ప్రజాశక్తి-చిన్నగంజాం (బాపట్ల) : ఆక్వా రైతు ఆహ్వానం మేరకు చిన్నగంజాం వద్ద ఆక్వా సాగును మంగళవారం మద్దులూరి మాలకొండయ్య సందర్శించారు. పంటకు గిట్టుబాటు ధరలు లేవని, విద్యుత్ సబ్సిడీని పునరుద్ధరించాలని, ఫీడ్ కి వాడే ముడి సరుకుల ధరలను నియంత్రించాలని తద్వారా ఫీడ్ తక్కువ ధరలకు రైతుకు అందించాలని, అంతర్జాతీయ మార్కెటింగ్ సౌకర్యాన్ని కలగజేయాలని, రాష్ట్ర ప్రభుత్వం అధునాతన యంత్రాలతో ఆక్వాఫీడ్ మిల్లులను నెలకొల్పి అంతర్జాతీయ మార్కెట్ చేసుకోవడానికి అవకాశం కల్పించాలని, గిట్టుబాటు ధరలు అందేటట్లుగా రానున్న తెలుగుదేశం ప్రభుత్వం కృషి చేస్తే ఆక్వా రైతులకు ఉపయోగం ఉంటుందని తెలిపారు. రైతుల సాదకబాధకాలు చంద్రబాబునాయుడు దఅష్టికి తీసుకువెళతానని రైతు ప్రయోజనాలే ధ్యేయంగా చంద్రబాబు కఅషి సలుపుతారని అన్నారు.