పార్వతీపురం టౌన్: స్థానిక మున్సిపల్ కమిషనర్ రెండోసారి కమిషనర్గా వచ్చిన పొందూరు సింహాచలం సోమవారం కలెక్టర్ నిశాంత్కుమార్ను మర్యాద పూర్వకంగా కలుసుకొని మొక్కను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ కమిషనర్ను అభినందిస్తూ పట్టణ అభివృద్ధికి సంబంధిత అధికారులతో కలిసి కృషి చేయాలని అన్నారు. వీటితోపాటు పట్టణ సమస్యలపై దృష్టి పెట్టి పరిష్కార దిశగా అడుగులు వేయాలని సూచించారు.