వీరఘట్టంలో మహిళా మార్ట్ ప్రారంభం

Jan 12,2024 15:50 #Manyam District
women smart in parvatipuram

ప్రజాశక్తి-వీరఘట్టం (పార్వతీపురం మన్యం) :  వీరఘట్టంలో వై యస్ ఆర్ చేయూత మహిళా మార్ట్ ను శుక్రవారం ప్రభుత్వ విప్ పాలవలస విక్రాంత్, జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ప్రారంభించారు. మహిళా మార్ట్ ను ప్రారంభించుటకు విచ్చేసిన ప్రభుత్వ విప్, జిల్లా కలెక్టర్ కు మహిళలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. జిల్లా కలెక్టర్ మహిళా మార్ట్ ను పరిశీలించి, స్వయంగా సరుకులను కొనుగోలు చేసి మహిళలను ప్రోత్సహించారు. మహిళా మార్ట్ లో విక్రయ ప్రక్రియ, బిల్లింగ్ ప్రక్రియ, మార్కెటింగ్ తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మహిళా సంఘాలు బలోపితం అయింది అనుటకు మహిళా మార్ట్ నిదర్శనం అన్నారు. మహిళలు గొప్ప శక్తి సామర్థ్యాలు కలిగిన వారు అని ఆయన పేర్కొన్నారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని ఆయన కోరారు. స్వయం సహాయక సంఘాలలో ఉన్న ప్రతి ఒక్క మహిళా గొప్ప పారిశ్రామిక, వ్యాపార వేత్తగా అడుగులు వేయాలని ఆయన సూచించారు. మహిళల్లో అనుకున్నది సాధించే శక్తి సామర్థ్యాలు ఉన్నాయని, పార్వతీపురం మన్యం జిల్లాలో అటవీ ఉత్పత్తులు తదితర ఫలసాయాలు పెద్ద ఎత్తున మార్కెటింగ్ చేయుటకు అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ పి కిరణ్ కుమార్ మాట్లాడుతూ వీరఘట్టం మండలంలో 1756 సంఘాల్లో 19316 మంది సభ్యులు ఉన్నారని తెలిపారు. సంఘం సభ్యులు వద్ద షేర్ కాపిటల్ గా రూ.30 లక్షలు ఉందని తెలిపారు. మహిళా మార్ట్ నిర్మాణానికి రూ.16.19 లక్షలు వ్యయం చేశారని చెప్పారు. మహిళలు వ్యాపార రంగంలో ముందంజ వేయాలని రాష్ట్ర ప్రభుత్వం పలు కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుని నేరుగా సరుకులు పంపిణీకి చర్యలు చేపట్టిందని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక అధికారులు, అనధికారికారులు, మహిళలు పాల్గొన్నారు.

➡️