ప్రజాశక్తి క్యాలెండర్‌ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే అనగాని

Dec 28,2023 15:12 #Bapatla District, #clander

ప్రజాశక్తి – రేపల్లె (బాపట్ల) : నిజాలను నిర్భయంగా రాసే ఏకైక పత్రిక ప్రజాశక్తి అని రేపల్లె ఎమ్మెల్యే అనగానీ సత్యప్రసాద్‌ అన్నారు. గురువారం పట్టణంలోని సిఐటియు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అంగన్వాడీల సమ్మె శిబిరం వద్ద ప్రజాశక్తి 2024 నూతన క్యాలెండర్‌ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనగానీ సత్యప్రసాద్‌ మాట్లాడుతూ.. ప్రజాశక్తి పత్రిక అన్ని రంగాలలో తనదైన శైలిలో వార్త కథనాలను అందిస్తోందన్నారు. అలాంటి కోవలో ప్రజాశక్తి కథనాలను ఇష్టపడే వారిలో తాను కూడా ఉన్నానని తెలిపారు.ప్రభుత్వ అభివద్ధి పథకాలను ప్రజలకు చేరవేయడంలోను, అదేవిధంగా సమస్యలను ఎండగట్టడంలో ను విన్నూత పద్ధతులలో ఆలోచించటం ప్రజాశక్తి కే చెందుతుంది అన్నారు. ముందుగా క్యాలెండర్‌ ను ఆవిష్కరించి ప్రజలను నూతన సంవత్సరంలోనికి తీసుకువెళ్లారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు సిహెచ్‌ మణిలాల్‌ నల్లూరుపాలెం చారిటబుల్‌ ట్రస్ట్‌ చైర్మన్‌ వీరవల్లి శివరామకష్ణ జనసేన పార్టీ నాయకులు మత్తి భాస్కరరావు, మాజీ ఎమ్మెల్యే ముమ్మనెని వెంకటసుబ్బయ్య, సిఐటియు తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు.

➡️