మున్సిపల్ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి 

Dec 26,2023 16:52
సమ్మెలో పాల్గొన్న మున్సిపల్ కార్మికులు
మున్సిపల్ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి 
సిఐటియు, ఏపీ మున్సిపల్ వర్కర్స్ & ఎంప్లాయిస్ ఫెడరేషన్ 
ప్రజాశక్తి – ఆత్మకురు
    మున్సిపల్ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం, ఉద్యోగాల పర్మినెంట్ చేస్తానని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  ఇచ్చిన హామీని అమలు చేయాలని సిఐటియు పట్టణ అధ్యక్షులు రజాక్, పట్టణ కార్యదర్శి  రామ్ నాయక్, ఉపాధ్యక్షులు రణధీర్, ఏపీ మున్సిపల్ వర్కర్స్ & ఎంప్లాయిస్ ఫెడరేషన్ నాయకులు గొడుగురాజు, పెద్ద నాగరాజు, జోసెఫ్ లు అన్నారు. మంగళవారం పట్టణంలోని మహాత్మా గాంధీజీ విగ్రహం దగ్గర నిరసన తెలియజేశారు.  ఈ సందర్భంగా మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులు ప్రజలందరికీ రోగాలు, వ్యాధులు సంభవించకుండా ప్రతిరోజు పట్టణాన్ని శుభ్రం చేస్తూ, కరోనా సమయంలో మున్సిపల్ కార్మికులు ప్రజలందరికీ కరోన సంభవించకుండా విధులు నిర్వహించారన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికలకు ముందు అసెంబ్లీ లోను, బయట పాదయాత్రలోను మున్సిపల్ కాంటాక్ట్, ఔట్సోర్సింగ్ కార్మికులందరిని మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే 6 నెలలో పర్మెంటు చేస్తానని, సమాన పనికి సమాన వేతం చెల్లిస్తామని, పర్మినెంట్ సిబ్బందికి సిపిఎస్ ను వారం రోజుల్లోనే రద్దు చేస్తామని హామీలు ఇచ్చారు. ఆయన అధికారంలోకి వచ్చి 5 సంవత్సరాలు పూర్తి కావస్తున్న ఇచ్చిన హామీలు నేటికీ అమలు చేయలేదన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు సురేంద్ర, మహమ్మద్, వీరన్న,  మున్సిపల్ కార్మికులు నాగన్న, మోహన్, సురేష్, దానమయ్య, రవి, రూతమ్మ, జీవరత్నమ్మ, మణెమ్మ, సుగుణమ్మ, కుమారి, సుశీలమ్మ,  తదితరులు పాల్గొన్నారు.
➡️