ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : మే 3,4,5 తేదీలలో విజయనగరం రాజీ ఇండోర్ స్టేడియంలో నేషనల్ టైక్వాండో రెఫరీ అండ్ రిఫ్రెషర్ సెమినార్ గోడ పత్రికను శనివారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా తైక్వాండో అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు గురాన అయ్యలు సిహెచ్ వేణుగోపాలరావు, సైక్లింగ్ అసోసియేషన్ అధ్యక్షులు ఎంఎస్ఎన్ రాజు, సెపక్తక్రా కార్యదర్శి రాజేష్, మహేష్ పాల్గొన్నారు. ఈ సెమినార్కు ఇంటర్నేషనల్ క్లాస్ 1 రిఫరీ తిరుమల్ జైపాల్ ఎగ్జామినర్గా వ్యవహరించబోతున్నారు.