‘ల్యాండ్‌ టైటిలింగ్‌’ కరపత్రాలు దహనం

May 11,2024 21:34

ప్రజాశక్తి – విస్సన్నపేట : విసన్నపేట మండలం తెల్లదేవరపల్లి గ్రామంలో చివరి రోజు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న తిరువూరు నియోజకవర్గ టిడిపి కూటమి అభ్యర్థి కొలికపూడి శ్రీనివాస్‌ ఈ కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి రాష్ట్రంలో అమలుపరిచిన ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ ప్రజలకు మంచిది కాదని అది ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటుందని ఈ విధంగా ఇచ్చిన దస్తావేజులు అధికారికంగా ప్రభుత్వానికే చెందుతుందని ఈ యాక్ట్‌ను వ్యతిరేకిస్తూ నిరసనగా కరపత్రాలను అగ్నితో కాల్చి బూడిద చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో మనుబోలు శ్రీనివాసరావు రాయల సుబ్బారావు రాయల సురేష్‌ తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️