ప్రజాశక్తి – ఇబ్రహీంపట్నం : ఇబ్రహీంపట్నం మండలం లోని కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలో పోలింగ్ కేంద్రాల్లో చేసిన ఏర్పాట్లను మైలవరం, నందిగామ, జగ్గయ్యపేట అసెంబ్లీ నియోజక వర్గాల సాధారణ పరిశీలకులు నరేందర్ సింగ్ బాలి మంగళవారం పరిశీలించారు. పరిశీలనలో భాగంగా పోలింగ్ స్టేషన్ల లోని విద్యుత్తు, ఫ్యాన్లు, తాగు నీరు, మరుగు దొడ్లు, షామి యానా వసతు లను సక్రమంగా ఉండేలా చర్యలు తీసుకో వాలని బిఎల్ఒలను ఆదేశించారు. కొండపల్లి మున్సి పాలిటీ కమిషనర్, ఎఆర్ఒ శంకర్ నాయిక్ని అధిక శాతం పోలింగ్ జరిగేలా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.