పోలీసుల కవాతు

May 4,2024 21:56

ప్రజాశక్తి – వన్‌టౌన్‌ : రాబోయే సాధారణ ఎన్నికల నేపథ్యంలో శాంతియుతంగా ఎన్నికలు నిర్వహించే విధంగా శనివారం టూ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఫ్లాగ్‌ మార్చ్‌ నిర్వహించారు. సంఘ విద్రోహ శక్తుల నిర్మూలించే దిశగా పోలీస్‌ వారి సంసిద్ధతను తెలియజేస్తూ ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర డీజీపీ, విజయవాడ సిటీ పోలీస్‌ కమిషనర్‌ ఆదేశాల మేరకు డిసిపి హరికృష్ణ పర్యవేక్షణలో వెస్ట్‌ ఎసిపి మురళీకృష్ణ అధ్యక్షతన టూ టౌన్‌ పట్టణ పోలీస్‌ స్టేషన్‌ సిఐ గణేష్‌ నేతత్వంలో కేంద్ర అదనపు బలగాలు, పోలీస్‌ స్టేషన్‌ ఎస్‌ఐలు, సిబ్బందిని మోహరించుకొని శనివారం సాయంత్రం పంజా సెంటర్‌, గొల్లపాలెం గట్టు ఏరియాలలో ఫ్లాగ్‌ మార్చ్‌ నిర్వహించారు.

➡️