పేదలకు అండగా వైసిపి మేనిఫెస్టో

Apr 27,2024 18:34

ప్రజాశక్తి – జగ్గయ్యపేట: చెప్పిందే చేస్తాం చేసేదే చెబుతాం అనే నినాదంతో వైసిపి మేనిఫెస్టో ఒక కురాన్‌, ఒక బైబిల్‌, ఒక భగవద్గీత లాంటిదని స్థానిక శాసనసభ్యులు సామినేని ఉదయభాను అన్నారు. శనివారం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి వైఎస్‌ఆర్సిపి మ్యానిఫెస్టో విడుదల చేసిన సందర్భంగా ఉదయభాను మాట్లాడుతూ మానిఫెస్టో ఆధారంగా 2019లో ఎలా నవరత్నాల పథకాలు ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ బడుగు బలహీన వర్గాలకు అగ్రవర్ణ పేదలకు అండగా నిలిచారో 2024లో కూడా అన్ని వర్గాలకు పేదలకు మహిళలకు పెద్దపీట వేస్తూ సంచలన మేనిఫెస్టోను రిలీజ్‌ చేశారని అన్నారు.

➡️