అక్రమంగా కలప రవాణా

Mar 29,2024 12:08 #palnadu district

ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : నరసరావుపేట నియోజకవర్గంలో అక్రమ కలప రవాణా యదేచ్ఛగా కొనసాగుతోంది. కొంతమంది కలప వ్యాపారులు అక్రమ సంపాధనే ధ్యేయంగా ఇష్టానుసారంగా చెట్లను నరికి ఇటుక బట్టీలకు, టింబర్ డిపోలకు తరలిస్తున్నారు. ఎలాంటి అనుమతులు తీసుకోకుండా కొంత మంది అటవీ అధికారులతో చీకటి ఒప్పందాలు కుదుర్చుకొని వాల్టా చట్టానికి తూట్లు పొడుస్తున్నారు. హోటళ్లకు సామిల్ డిపోలకు తరలుతున్న పట్టించుకునే నాథుడే కరువయ్యారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.సంబంధిత అధికారులు అక్రమంగా చెట్లను నరికి సొమ్ము చేసుకునే వారిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

➡️