ప్రజాశక్తి-సత్తెనపల్లి రూరల్ : సత్తెనపల్లి పట్టణంలో పల్నాడు జిల్లా కలెక్టర్ ఎల్ శివశంకర్ నగరోదయం కార్యక్రమం పాల్గొన్నారు. పల్నాడు జిల్లాలో బాలికలు రక్తహీనత తో బాధపడుతున్నారని దీన్ని అధిగమించేందుకు బంగారు తల్లి పథకం కింద వారినీ గుర్తించి వారికి పాఠశాలల్లో పౌష్టికాహారం అందిచేస్తున్నామని వెల్లడించారు. తల్లిదండ్రులు కూడా వారికి పౌష్టికాహారం అందించాలని జిల్లా కలెక్టర్ సూచించారు. పలు వార్డుల్లో ఆయన పర్యటించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.