ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : మాస్ కాపీయింగ్ కు ఆస్కారం లేకుండా 10వ తరగతి పరీక్షలు పటిష్టంగా నిర్వహించాలని సిబ్బందిని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. స్థానిక లింగంగుంట్ల గ్రామ పరిధిలో గల శంకర భారతిపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి పరీక్షా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద ఏర్పాట్లను పరిశీలించి సిబ్బందికి తగు సూచనలు చేశారు.