ప్రజాశక్తి-గంపలగూడెం (ఎన్టిఆర్) : రోడ్డు ప్రమాదంలో పోస్ట్మాన్ మృతి చెందారు. గంపలగూడెం తూర్పు దళితవాడకి చెందిన తాళ్లూరు కృష్ణదాస్ (55) పోస్ట్మాన్ ఉదయం విజయవాడ నుండి స్కూటీపై వస్తుండగా, చీమలపాడు-గంపలగూడెం ప్రధాన రహదారి వద్ద ఎదురుగా వస్తున్న గేదెలు ఒక్కసారిగా కలబడి మీదపడ్డాయి. తీవ్ర గాయాలైన కృష్ణదాస్ ను ప్రాథమికంగా మైలవరం ఆస్పత్రికి తరలించగా, మెరుగైన వైద్యం అందిస్తుండగానే విజయవాడలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి పంపారు. వైద్యం అందిస్తుండగానే దాస్ మృతి చెందారు. కృష్ణదాస్ గంపలగూడెం మండలం గొల్లపూడి పోస్ట్మాన్గా విధులు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. మృతునికి భార్య, ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి ఉన్నారు. విషయం తెలుసుకున్న పోస్టల్ సిబ్బంది కృష్ణదాస్ మఅతి పట్ల సంతాపాన్ని తెలియజేశారు.