ప్రజాశక్తి-మార్కాపురం : మార్కాపురం మండలం నికరంపల్లి గ్రామ సమీపంలోనీ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం ఒకరు మృతి చెందారు. లారీ – బొలెరో వాహనం ఢీకొని ఘటన శనివారం ఉదయం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. చికిత్స నిమిత్తం మార్కాపురంలోని జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.